సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్ళుగా తప్పించుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. పలు స్టేషన్లలో వర్మపై కేసులు నమోదు అయినా సరే ఆయన విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ఏపీ పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్ళినా వర్మ మాత్రం దొరకలేదు. తర్వాత వీడియోలు విడుదల చేసి పోలీసులకు షాక్ ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు పెడుతూ సవాల్ చేసాడు వర్మ. అలాగే తనపై పెట్టిన కేసులకు చట్టాలు వర్తించవు అంటూ కేసు నంబర్లను కూడా అక్కడ రాసుకొచ్చాడు.
Also Read : జగన్ బెయిల్ రద్దు కేసులో కీలక ముందడుగు
ఇదే సమయంలో పలు న్యూస్ చానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు వర్మ. అసలు అరెస్ట్ చేస్తారా లేదా అనుకుంటున్న టైం లో ఏపీ హైకోర్ట్ పోలీసులకు షాక్ ఇచ్చింది. హైకోర్టులో రాం గోపాల్ వర్మకు ఊరట లభించింది. రామ్ గోపాల్ వర్మ కేసులో… వచ్చే సోమవారం వరకు ఏ చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.. రిట్ పిటిషన్ పై వచ్చే సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం న్యాయవాదిని కోర్ట్ ఆదేశించింది.
Also Read : తెలంగాణాలో టీడీపీ గేమ్ స్టార్ట్
సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు, ఫోటో మార్ఫింగ్ పోస్టులు చేశారంటూ వర్మపై ముందు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల పరిధిలో పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఇదే కేసులో హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రామ్ గోపాల్ వర్మ… తాను ఎక్కడ ఉన్నదీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. కాగా తాను తన ఆఫీస్ లోనే ఉన్నా అంటూ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.