Friday, September 12, 2025 05:11 PM
Friday, September 12, 2025 05:11 PM
roots

అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంగా మారిన పదం..!

తమిళనాడు ఎన్నికలను బిజెపి సీరియస్ గా తీసుకున్న నేపధ్యంలో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార డిఎంకె.. బిజెపిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తోంది. దక్షిణాది భావజాలాన్ని డిఎంకె ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది. తాజాగా డిఎంకె కీలక నేత రాజా.. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. అమిత్ షా మూర్ఖుడు అంటూ ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ తమిళనాడులోకి ప్రవేశిస్తుందని షా ఇటీవల ఓ కామెంట్ చేసారు.

Also Read : వివేకా కేసులో మరో నిందితుడ్ని లేపెయడానికి ప్లాన్..?

బహిరంగ సభలో ప్రసంగిస్తూ రాజా.. అమిత్ షా మధురైకి వచ్చి.. మనం ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు.. తరువాత తమిళనాడు అని ఆయన అన్నారని.. అమిత్ షా ఒక మూర్ఖుడు అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఒక రాజకీయ పార్టీకి ఏకైక నాయకుడు.. హర్యానా, మహారాష్ట్రలలో ఆయన ఒంటరి వ్యక్తిని ఓడించారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఒంటరి వ్యక్తి కాదు.. ఎందుకంటే అతని వెనుక పెరియార్, అన్నా, కరుణానిధి, ద్రవిడ తత్వశాస్త్రం ఉన్నాయన్నారు.

Also Read : టీడీపీ, వైసీపీ మధ్య సెక్యూరిటీ వార్..!

ద్రవిడ సైద్ధాంతిక సంప్రదాయం ముందు బిజెపి “అయోమయంగా” కనపడుతోందని విమర్శించారు. రాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిజెపి అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి.. తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి, మూర్ఖుడు.. ఎ రాజా అమిత్ షాను ‘మూర్ఖుడు’ అని పిలిచి అమర్యాదకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసారు. భారత హోంమంత్రిని అలా విమర్శించే ఎవరైనా మూర్ఖులే కావచ్చన్నారు. తమిళనాడులో బిజెపి విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్