భారత్ లాంటి దేశాల్లో క్రికెట్ కు లభించే ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. లక్షలాదిమంది ఆటగాళ్లు తుది జట్టులో చోటు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఆటగాళ్లు అవకాశం వచ్చిన సరే ఆడలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని పరిస్థితుల కారణంగా చాలామంది ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు. ఇటీవల యశస్వి జైస్వాల్ పరిస్థితి చూస్తే చాలామంది క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఎంతో టాలెంట్ ఉన్న జైస్వాల్ అవకాశం వచ్చిన ప్రతిసారి రాణిస్తూనే ఉన్నాడు.
Also Read :తప్పుడు ఆరోపణలు.. వాస్తవాలు..!
ఆస్ట్రేలియా పర్యటన, ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ పర్యటనల్లో అతను మెరుగ్గా రాణించాడు. అర్థ సెంచరీలు, సెంచరీలతో సత్తా చాటిన సరే కొన్నిసార్లు అవకాశాలు మాత్రం రాలేని పరిస్థితి. ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ కు అతనిని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. కానీ జట్టులో చోటు మాత్రం అతనికి దక్కలేదు. కెప్టెన్ గిల్ కంటే ఫాస్ట్ పిచ్ లలో అతను మెరుగుగా రాణించిన సందర్భాలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న ఆటగాడు అయినా సరే మాత్రం టెస్ట్ క్రికెట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. టి 20 జట్టులో టాప్ 10 లో ఉన్నా సరే అతనికి అవకాశాలు మాత్రం రాలేదు.
Also Read :రంగంలోకి పవన్.. సోషల్ మీడియాలో పవన్ తుఫాన్
వన్డే క్రికెట్లో మాత్రం ఒకటి రెండు అవకాశాలు ఇచ్చి పక్కన పెట్టారు. టి20 జట్టుకు పూర్తిగా అతనిని విస్మరించడంపై కూడా విమర్శలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో గత నాలుగేళ్ల నుంచి పెద్దగా రాణించిన పరిస్థితి లేదు. కానీ తొలి పర్యటనలోనే జైస్వాల్ ఎంతో సత్తా చాటాడు. కానీ అవకాశం ఇచ్చే విషయంలో మాత్రం సెలెక్టర్లు ముందుకు రావటం లేదు. ఐపీఎల్ ను మాత్రమే పరిగణలోకి తీసుకునే సెలెక్టర్లు జైస్వాల్ అక్కడ రాణించిన సరే అవకాశం మాత్రం ఇవ్వడం లేదు.

