పలు రంగాల్లో ఆవిష్కరణలు చేసే విషయంలో చైనా, జపాన్ దేశాలు ముందు ఉంటాయి. ముఖ్యంగా రవాణా రంగంలో ఈ దేశాలు కీలక అడుగులు వేస్తూ ఉంటాయి. రైల్వే వ్యవస్థలో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేసేందుకు సిద్దంగా ఉంటాయి. తాజాగా చైనా కీలక అడుగు వేసింది. విమానం కంటే వేగవంతమైన రైలును పరీక్షించింది. కొత్త హై-స్పీడ్ మాగ్లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) రైలును విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. గంటకు 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే రైలును రూపొందించింది.
Also Read : కోహ్లీ బాటలోనే రోహిత్.. లండన్ పయనం అవుతున్నాడా..?
తమ దేశంలో కీలక నగరాల మధ్య రవాణా దూరాన్ని తగ్గించడంలో ఈ అడుగులు వేసింది. బీజింగ్, షాంఘై మధ్య ఉన్న 1,200 కిలోమీటర్ల ప్రయాణం ప్రస్తుతం హై-స్పీడ్ రైలులో దాదాపు 5.5 గంటలు పడుతుంది. కానీ కొత్త మాగ్లెవ్ రైలుతో, దీనికి 2.5 గంటలు లేదా 150 నిమిషాలు మాత్రమే పట్టవచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఈ వారం 17వ మోడరన్ రైల్వేస్ ఎగ్జిబిషన్లో ఈ రైలును ఆవిష్కరించారు. ఏడు సెకన్లలోనే అత్యధిక వేగాన్ని అందుకుంది ఈ రైలు.
Also Read : ఆ 5 తప్పులే భారత్ ను ఓడించాయా..?
హుబే ప్రావిన్స్లోని డోంఘు లాబొరేటరీలో నిర్వహించిన పరీక్షలలో, మాగ్లెవ్ రైలు ఒక చిన్న టెస్ట్ ట్రాక్పై 7 సెకన్లలోపు 404 mph (సుమారు 650 కి.మీ/గం) వేగాన్ని అందుకుంది. సాధారణంగా విమానాలు గంటకు 880 నుండి 925 కి.మీ మధ్య వేగంతో ఎగురుతాయి. ఈ రైలు కూడా అదే వేగంతో ప్రయాణించే విధంగా తయారు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న సాంకేతికత అయస్కాంత లెవిటేషన్పై ఆధారపడి ఉంటుంది. రైల్వే ట్రాక్ పై ఎక్కువగా ఆధారపడకుండా ఈ రైలు ప్రయాణం చేస్తుంది. ఈ రైలు గంటకు 620 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుందని ఇంజనీర్లు చెప్తున్నారు.