Wednesday, February 4, 2026 05:53 PM
Wednesday, February 4, 2026 05:53 PM

సచివాలయానికి దూరంగా మంత్రులు..? బాబు వార్నింగ్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆరోపణ మంత్రుల మీద ఎక్కువగా వినిపించేది. అప్పట్లో ముఖ్యమంత్రి తో సహా చాలామంది మంత్రులు సచివాలయానికి వెళ్లేవారు కాదు. దీనితో పాలన పడకేసింది అనేది అప్పట్లో విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపించేవి. కీలక ఫైల్స్ సైతం ఎక్కువగా వైయస్ జగన్ ఇంట్లోనే సంతకాలు అయ్యేవి. మంత్రుల సమీక్ష సమావేశాలు కూడా అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించేవారు. ఇక ఇప్పుడు కొంతమంది మంత్రుల వ్యవహార శైలి కూడా అలాగే ఉందనేది ప్రధాన ఆరోపణ.

Also Read : వైసీపీకి మరో రాజ్యసభ ఎంపీ రాంరాం

ముగ్గురు నలుగురు మంత్రులు సచివాలయానికి వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విజయవాడలో ఉంటున్నా సచివాలయానికి మాత్రం దూరంగానే ఉంటున్నారు. అధికారులు కూడా మంత్రుల క్యాంప్ ఆఫీసులోనే పనులు చేయడం జరుగుతోంది. నాలుగు నెలల క్రితం మంత్రిపై ఇవే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే ఆరోపణలు మరో ముగ్గురు మంత్రులపై వస్తున్నాయి. సచివాలయానికి దూరంగా ఉండే మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు కాస్త అసహనంగా ఉన్నారట. కేవలం క్యాబినెట్ సమావేశం జరిగే సమయంలోనే మంత్రులు సచివాలయానికి వెళ్తున్నారు.

Also Read : ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు బాబు, పవన్ రెడీ

అమరావతి పనుల మీద కూడా మంత్రులు అవగాహన పెంచుకోవడంలేదని ఆరోపణ వినపడుతోంది. ఇటీవల పనులు మొదలైన తర్వాత కొంతమంది మంత్రులు అమరావతి వెళ్లలేదట. ఇక పేషీలో ఏం జరుగుతుందో కూడా కొంతమంది మంత్రులు పట్టించుకోవడంలేదనే విమర్శ సైతం వినపడుతోంది. పెత్తనం మొత్తం ఓఎస్డీలకు అప్పగించారని.. కీలక ఫైల్స్ ను మానిటర్ చేయటం లేదనేది ప్రభుత్వ వద్దకు సమాచారం వెళ్ళింది. దీనిపై కొందరు మంత్రులను ఇటీవల క్యాబినెట్ సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు వివరణ కూడా అడిగినట్లు సమాచారం. మరి మంత్రుల వ్యవహార శైలిలో ఎప్పుడు మార్పు వస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్