Thursday, February 5, 2026 03:28 AM
Thursday, February 5, 2026 03:28 AM

సస్పెండ్ కాదు..వాళ్ళందరూ అరెస్ట్ ఖాయం

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో కొందరు అధికారులు రాజకీయ నాయకులను మించి రాజ్యంలో ప్రభావం చూపించారు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుడి ఎడమ భుజాలు చెప్పినట్టుగా చేసి, వాళ్ళ కోపాన్ని వీళ్ళు తీసుకుని కొందరు రాజకీయ నాయకులను సామాన్యులను అన్ని విధాలుగా వేధించడం మొదలుపెట్టారు. ఎక్కడో ముంబైలో ఉండే సినిమా నటిని కూడా వేధించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపిఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇలా దాదాపు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు చాలా వరకు జగన్ కు సేవ చేసారు.

ఇప్పుడు వాళ్లకు రంగం సిద్దమవుతోంది. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న కూటమి సర్కార్ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. ఎవడితో అయినా పెట్టుకో రాజకీయ నాయకుడితో కాదు అంటూ ప్రూవ్ చేస్తోంది. తప్పుడు కేసులు కాకుండా పక్కా సాక్ష్యాలతో ఉచ్చు బిగించడం మొదలుపెట్టింది కూటమి సర్కార్. హీరోయిన్ కేసులో ముగ్గురు ఐపిఎస్ అధికారులు సహా పలువురు అధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రఘురామా కృష్ణం రాజుని వేధించిన కేసులో అధికారులకు ఉచ్చు బిగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Read Also : తొలి విడత నామినేటెడ్ పదవులు ప్రకటించిన చంద్రబాబు

కస్టడిలో రఘురామ కృష్ణం రాజుని వేధించిన విజయ్ పాల్ విషయంలో హైకోర్ట్ ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీనితో ఆయనను అరెస్ట్ చేయడం ఖాయంగా కనపడుతోంది. ఇక హీరోయిన్ కేసులో కాంతి రానా తాతాను కూడా అరెస్ట్ చేయడం ఖాయంగా కనపడుతోంది. అటు పీవీ సునీల్ కుమార్ కి కూడా ఉచ్చు బిగిస్తున్నారు అధికారులు. త్వరలోనే పీవీ సునీల్ కుమార్ ను అరెస్ట్ చేయవచ్చనే కథనాలు వస్తున్నాయి. రఘురామ కేసులో కొందరు ఎస్సైలు సిఐల మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఐపిఎస్ అధికారులను అరెస్ట్ చేయవచ్చు అనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. అందుకే ముందస్తు బెయిల్ కోసం కోర్ట్ ల చుట్టు తిరుగుతున్నారు అధికారులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్