మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ సీక్వెల్ షూటింగ్ 50% దాదాపుగా కంప్లీట్ అయింది. ఇక మిగిలిన షూటింగ్ ను త్వరలోనే కృష్ణాజిల్లాలో మొదలుపెట్టనున్నారు మేకర్స్. దీనిపై ఇప్పటికే వర్కౌట్ కూడా కంప్లీట్ చేశాడు డైరెక్టర్ బోయపాటి. ఇక ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ ను తీసుకునేందుకు బోయపాటి ఇంకా వర్కౌట్ చేస్తూనే ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాకు క్రేజ్ ఉండటంతో బోయపాటి జాగ్రత్త పడుతున్నాడు. అఖండ ఫస్ట్ పార్ట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read : వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో యుద్ద మేఘాలు
దీనితో ఈ సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమాలో ఇప్పటికే ఐశ్వర్యరాయ్ తో పాటుగా తమిళ స్టార్ హీరో ఒకరు నటిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. ఇక లేటెస్ట్ గా ఆది పినిశెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా అనౌన్స్ చేసాడు. గత కొన్ని రోజులుగా దీనిపై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఆది పినిశెట్టి దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.
Also Read : ప్రభాస్ రూట్ లోనే ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండుగే…!
తాను ఈ సినిమాలో నటిస్తున్నానని, ఇప్పటికే తన పోర్షన్ కు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిందని, త్వరలోనే మరో షెడ్యూల్ ఉండబోతుందంటూ అనౌన్స్ చేశాడు. చాన్నాళ్ల తర్వాత బాలకృష్ణతో కలిసి వర్క్ చేశానని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ కూడా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోగా.. త్వరలోనే కృష్ణాజిల్లాలోని గుడిమెట్ల గ్రామంలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. బాలకృష్ణ లేకుండానే కృష్ణా జిల్లాలో షూటింగ్ చేసే అవకాశం ఉంది.




