Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

అమరావతిపై విషం.. గులాబీ కార్యకర్తలను వదలొద్దు అంటున్న ప్రజలు..!

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు వైసిపి విషం చిమ్ముతూనే ఉంది. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కొందరు వ్యక్తులు అమరావతి విషయంలో అత్యంత దారుణంగా ప్రచారం చేయడానికి టిడిపి కార్యకర్తలు తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో కమ్మ కులాన్ని వ్యతిరేకించే కొందరు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రచారానికి దిగుతున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిలో ఓ అధికారికి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.

Also Read : ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటో..?

అయితే ఇక్కడ.. వైసీపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి సహకరిస్తుంది. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ముందు నుంచి అమరావతి విషయంలో ఇదే ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో వరద ఉన్న ఫోటోలు కూడా చూపించి అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాత ఫోటోలు కూడా బయటకు తీసి వాటిని మార్ఫింగ్ చేసి అమరావతి మునిగిపోయింది అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ప్రతి వర్షాకాలం ఇదే తంతు కొనసాగుతోంది.

Also Read : వాళ్ళను చంద్రబాబు వదలరు.. అసెంబ్లీలో కొత్త చట్టం

దీంతో ఆ పార్టీ కార్యకర్తలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినపడుతున్నాయి. తాజాగా హోం మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అమరావతిపై తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారికి మాత్రమే ఇది వర్తించకూడదని తెలంగాణలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని సోషల్ మీడియాలో టిడిపి కార్యకర్తలు కోరుతున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటుగా అమరావతిని అత్యంత దారుణంగా అవమానిస్తున్న బి.ఆర్.ఎస్ కార్యకర్తలను వదలొద్దని.. ఈ ప్రచారంతో పారిశ్రామిక రంగంలో కూడా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మునిగిపోయిన మాట్లాడని ఆ పార్టీ కార్యకర్తలు అమరావతి విషయంలో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్