Friday, October 24, 2025 08:16 AM
Friday, October 24, 2025 08:16 AM
roots

పంత్ వచ్చేస్తున్నాడు.. వికెట్ కీపింగ్ చేయడా? టీ20 ప్రపంచకప్‌కూ మేలే!

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు ఏడాదికి పైగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అతడు (Rishabh Pant) బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు దీనిపై ఇది వరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. కానీ ప్రస్తుతం పంత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే అక్కడి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పంత్‌ ఎన్‌సీఏ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు అనే ఉత్కంఠ ఢిల్లీ క్యాపిటల్స్, పంత్ అభిమానుల్లో నెలకొంది. వాటన్నిటికీ చెక్ పెట్టేలా గంగూలీ సమాధానమిచ్చాడు.

రిషభ్ పంత్ మార్చి 5న జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని గంగూలీ వెల్లడించాడు. అతడు ప్రస్తుతం మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడని.. దీంతో ఎన్‌సీఏ అతడికి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వనుందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఎదురైన పలు ప్రశ్నలపై గంగూలీ సమాధానం ఇచ్చాడు.

‘మార్చి 5న రిషభ్ పంత్‌కు ఎన్‌సీఏ నుంచి అనుమతి రానివ్వండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే అతడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరతాడు. ఆ తర్వాతే ఈ సీజన్‌లో పంత్ కెప్టెన్సీ గురించి మాట్లాడతాం. ఎందుకంటే అతడికి సుదీర్ఘమైన కెరీర్ ఉంది. ఒక్కో మ్యాచ్ ఆధారంగా పంత్ ప్రదర్శనను చూస్తాం. దాన్ని బట్టే అంచనా వేస్తాం. ఇప్పుడే ఏం చెప్పలేం’ అని గంగూలీ అన్నాడు.

వికెట్ కీపర్‌గా కాకుండా కేవలం బ్యాటర్‌గానే పంత్ జట్టులో ఆడతాడని గంగూలీ తెలిపాడు. ‘వికెట్ కీపింగ్ కోసం మా జట్టులో (ఢిల్లీ క్యాపిటల్స్) చాలా ఆప్షన్లు ఉన్నాయి. కుమార్ కుశాగ్రా, రిక్కీ భుయ్, షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్‌లు వికెట్ కీపర్ ఆప్షన్లుగా ఉన్నారు’ అని గంగూలీ తెలిపారు.

‘పంత్ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులోకి తిరిగి వస్తే చాలు. అదే మా జట్టుకు అతిపెద్ద బలం. అతడు చాలా ప్రత్యకమైన ప్లేయర్. ఈ సీజన్‌ పూర్తిగా ఆడతాడని భావిస్తున్నాం. ఈ సీజన్‌ కోసం అన్ని ఫార్మాట్లలో సత్తాచాటిన దేశవాళీ ఆటగాళ్లపై మేం దృష్టి సారించాం’ అని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. పంత్ తిరిగి బ్యాట్ పట్టనుండటం ఐపీఎల్‌కే కాదు, టీ20 ప్రపంచకప్ కూడా మేలేనని సీనియర్ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. మార్చి 7 వరకు జరగాల్సిన తొలి 21 మ్యాచులుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ఖరారు చేసింది. మిగతా మ్యాచుల షెడ్యూలును సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బీసీసీఐ ప్రకటించనుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

పోల్స్