విదేశాల్లో టెస్ట్ సీరీస్ అనగానే కొందరు ఆటగాళ్లకు పండుగే. అందులో కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, పుజారా, బూమ్రా ముందు వరుసలో ఉంటారు. పిచ్ ఎంత కఠినంగా ఉన్నా సరే నిలకడగా రాణిస్తూ ఉంటారు ఈ ఆటగాళ్ళు. ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్ లో కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరూ ప్రభావం చూపించారు. కెఎల్ రాహుల్ ఓపెనర్ గా వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా అదే స్థాయిలో రాణించాడు. డిఫెన్స్ తో పాటుగా తన మార్క్ షాట్స్ తో అల్లాదించాడు.
Also Read : యోగాంధ్ర టార్గెట్ అదే.. బాబు రీచ్ అవుతారా..?
కీలక ఇన్నింగ్స్ ఆడి అర్ధ సెంచరీ సాధించాడు పంత్. ఇదే సమయంలో ఓ రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ పొట్టి ఆటగాడు. శుక్రవారం హెడింగ్లీలో ప్రారంభమైన తొలి టెస్ట్ లో రిషబ్ పంత్ కీలక మైలురాయి సాధించాడు. SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా) దేశాలలో అత్యంత విజయవంతమైన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్గా నిలిచాడు. 26 ఏళ్ల రిషబ్ పంత్ 2025–27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ను ఘనంగా ప్రారంభించాడు.
Also Read : సురేఖా వాణి ఏమి టాటూ వేయిచుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో తొలి రోజున అజేయంగా 65 పరుగుల చేసిన పంత్ ధోనీ ని అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్ లో పంత్ టెస్ట్ క్రికెట్ లో 3,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు. 76వ ఇన్నింగ్స్ లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ తర్వాత అత్యంత వేగవంతమైన వికెట్ కీపర్ గా రెండో స్థానంలో నిలిచాడు. 63 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని అందుకున్నాడు గిల్ క్రిస్ట్.




