టిడిపి ప్రభుత్వం పై అసత్య కథనాలతో తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఎక్స్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్. నారా లోకేష్ చేసిన పోస్ట్ ని యథాతధంగా కింద మీకు అందిస్తున్నాము.
ఏం చదివావో తెలియదు.. ఎక్కడ చదివావో అస్సలు తెలియదు.. నువ్వు విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం
మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సిబిఎస్ఈ లో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంసమామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అన్నట్టు మీరు అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సెలవివ్వండి.