Friday, September 12, 2025 05:11 PM
Friday, September 12, 2025 05:11 PM
roots

సిక్కోలు లో వైసీపీ దుకాణం బంద్…!

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందనేది వాస్తవం. ఇప్పటికే అత్యంత నమ్మకస్తులే జగన్‌కు షాక్ ఇచ్చారు. బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, నమ్మినబంటు ఆళ్ల నాని, సామినేని ఉదయభానులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వైసీపీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. చిత్తూరు నుంచి విజయనగరం జిల్లా వరకు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఒక్క నేత కూడా రాజీనామా చేయలేదు. దీంతో ఆహా సిక్కోలు అండగా ఉందని ఇటీవల జరిగిన జిల్లా నేతలతో జగన్ సంతోషం కూడా వ్యక్తం చేశారు. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పరిస్థితి మాత్రం మేడిపండును తలపిస్తోంది. మేడిపండు చూడ మేలిమై ఉండు… పొట్ట విప్పి చూడ పురుగులుండు… అన్నట్లుగా వైసీపీ పరిస్థితి మారిపోయింది.

Read Also : ఏపీకి కొత్తగా రెండు వందే మెట్రోలు…!

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరిపోయాయనేది వాస్తవం. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జిల్లా పెద్ద దిక్కు, సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏమయ్యారో తెలియటం లేదు. ఇక ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు నెలకోసారి ప్రెస్ ముందుకు వచ్చి వెళ్లిపోతున్నారు. ఇక ఎన్నికల ముందు వరకు దూకుడుగా వ్యవహరించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. కుటుంబ తగాదాలతో నెల రోజులు పైగా దువ్వాడ పరువు పోయింది. దీంతో టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ పదవి నుంచి దువ్వాడను తొలగించిన జగన్… ఆయన స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు. దీంతో దువ్వాడ పరిస్థితి మరింద దిగజారిపోయింది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్, కంబాల జోగులు, పిరియా సాయిరాజ్ వంటి నేతలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి.

టికెట్ ఆశించి భగపడిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఇప్పటికే వైసీపీ రాజీనామా చేశారు. ధర్మాన ప్రసాదరావు కూడా త్వరలో పార్టీ మారుతారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. జిల్లా పెద్దాయనే పార్టీ మారితే… ఆయనతో ఎంత మంది వెళ్తారో అనే చర్చ కూడా ఇప్పటికే జోరుగా నడుస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నేత కరువయ్యాడని పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్