Sunday, October 19, 2025 01:21 PM
Sunday, October 19, 2025 01:21 PM
roots

నందమూరి బాలకృష్ణ వారసురాలిగా…!

నందమూరి కుటుంబం.. తెలుసు సినీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఫ్యామిలీ. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావుతో మొదలైన నందమూరి సినీ ప్రయాణం 4 తరాలుగా కొనసాగుతూనే ఉంది. ఎన్‌టీఆర్ నట వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ వెండితెరపై అభిమానులను అలరించారు. ఇక మూడో తరంలో తారక్, కళ్యామ్ రామ్, తారక రత్న వంటి నటులు.. అభిమానులను మెప్పించారు. వీరితో పాటు ఎన్టీఆర్ పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరి మనవడు కూడా ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించారు. దీంతో రామారావు కుటుంబంలో నాలుగో తరం కూడా సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చినట్లు అయ్యింది.

Also Read : డిజిటల్ బుక్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు

నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ రంగంలో అయినా సరే.. ఆయనే రాజుగా కొనసాగారు. సినీ ప్రయాణంలో అగ్ర హీరోగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి.. రికార్డు సృష్టించారు. ఇక ఆయన సినీ వారసులుగా వచ్చిన నందమూరి బాలకృష్ణ.. 50 ఏళ్లుగా వెండితెరపై విశ్వరూపం చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ బాలయ్యకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక నందమూరి తారక రామారావు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగారు. ఇక త్వరలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా వెండితెరపై తన అదృష్టాన్ని పరిక్షీంచుకోనున్నారు.

Also Read : కల్తీ మద్యంపై యుద్ధమే.. బెజవాడలో వైసీపీ సైలెంట్ విచారణ

అయితే నందమూరి కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా కెమెరా ముందుకు రాలేదు. అక్కినేని కుటుంబం నుంచి కోడలు అమల, మనవరాలు సుప్రియ సినిమాల్లో నటించారు. కృష్ణ కుమార్తె మంజుల కూడా చాలా సినిమాల్లో కనిపించారు. మహేష్ బాబు కుమార్తె సితార కూడా టీవీ యాడ్స్‌ చేస్తోంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నిహారిక సినిమాల్లో వెబ్ సిరీస్‌లలో, బుల్లి తెరపై కూడా కనిపించారు. కానీ నందమూరి ఫ్యామలీ నుంచి మహిళల్లో ఒక్కరు కూడా కెమెరా ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు ఆ రికార్డును చెరిపేశారు బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని. తొలిసారిగా తేజస్విని కెమెరా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా తేజస్విని ప్రచారం చేస్తున్నారు. ఈ యాడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన సంస్థ.. త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీంతో నందమూరి కుటుంబంలో కెమెరా ముందుకు వచ్చిన తొలి మహిళగా తేజస్వినిని అభివర్ణిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్