Friday, September 12, 2025 11:21 PM
Friday, September 12, 2025 11:21 PM
roots

ఆ 4 నియోజకవర్గాల ప్రజల కల నెరవేరే వేళ..!

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు పాలకులు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు వైసీపీ సర్కార్ కనీసం ఒక్క మంచి కూడా చేయలేదు అనేది ఎన్నికల సమయంలో కూటమి నేతల ఆరోపణ. ఇందులో ప్రధానంగా రహదారుల మరమ్మతు. గ్రామీణ మార్గాలతో పాటు ప్రధాన రహదాలను కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రధాన నగరాల మధ్య ప్రయాణం కూడా నరకప్రాయంగా మారిపోయింది. నిత్యం రద్దీగా ఉండే మార్గాల్లో కూడా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేశారు. అలాంటి రహదారుల్లో ఒకటి విజయవాడ – కంకిపాడు – మానికొండ – నందమూరు – వెంట్రాప్రగడ – గుడివాడ మార్గం ఒకటి.

Also Read : వర్మ తెలివి పోసానికి లేకుండా పోయిందే..!

వరుసగా నాలుగు సార్లు గెలిచినప్పటికీ… మంత్రిగా వ్యవహరించినప్పటికీ.. ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు మాజీ మంత్రి కొడాలి నాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయావాడ నుంచి గుడివాడకు కంకిపాడు, మానికొండ మీదుగా కేవలం 42 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ మార్గం పెనమలూరు, గన్నవరం, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల మీదుగా ప్రయాణిస్తుంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే మార్గం. రహదారికి రెండు వైపులా కాలువలు ఉండటం వల్ల రహదారి పూర్తిగా కుంగిపోతుంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చినప్పటికీ.. కనీసం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఈ మార్గం మీదుగా ప్రయాణించకుండా… ఉయ్యూరు, పామర్రు మీదుగా ప్రయాణించారు తప్ప… మానికొండ, వెంట్రాప్రగడ వైపు వస్తే ప్రజలు నిలదీస్తారనే భయంతో ఆ వైపు రాలేదు.

Also Read : మౌనమే.. విజయసాయి రెడ్డిపై సైలెంట్ గా వైసీపీ

ఈ రహదారి మరమ్మతులపై అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రస్తావించారు. సాధ్యమైనంత వేగంగా రహదారి మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రెండు వైపులా కాలువలు ఉండటం వల్ల కుంగిపోతుందని.. దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధిత శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా జవాబిచ్చారు. దీనిపై సంబంధిత శాఖ మంత్రి జవాబిచ్చారు. CRIF కింద రూ.16 కోట్లతో గుడివాడ – కంకిపాడు మార్గం అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ పని ఏప్రిల్ 26 లోపు పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా SDMF కింద రూ.5 కోట్లు కూడా కేటాయించామన్నారు. గుడివాడ – కంకిపాడు రోడ్డులో 11వ కి.మీ. నుంచి 15వ కి.మీ. వరకు రూ.40 లక్షలతో అత్యవసర పనుల కింద మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. గుడివాడ – కంకిపాడు మధ్య 15వ కి.మీ నుంచి 25వ కి.మీ వరకు రూ.రెండున్నర కోట్లతో పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ పనులన్నీ మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో కనీసం ఒక్క లేయర్ కూడా వేయలేదని… గుంత కూడా పూడ్చలేదన్నారు మంత్రి జనార్థన్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1800 కోట్లతో రహదారి మరమ్మతులు చేస్తున్నామన్నారు. మంత్రి జవాబుతో 4 నియోజకవర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్