Friday, September 12, 2025 05:23 PM
Friday, September 12, 2025 05:23 PM
roots

జగన్ ఇంటి తలుపు తట్టిన లిక్కర్ స్కామ్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఒక్కో కీలక అడుగు వైసీపీ అధిష్టానం గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. కీలక వ్యక్తులను ఈ లిక్కర్ స్కాం లో అరెస్ట్ చేయడంతో తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కాంలో నాటి సిఎం వైఎస్ జగన్ పాత్ర ఉందనేది ప్రధాన ఆరోపణ. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత జగన్ పేరే ఎక్కువగా వినపడింది. జగన్ కోసమే తాను ముడుపులు తీసుకున్నాను అంటూ కేసిరెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

Also Read : కూటమి సర్కారుపై జగన్‌ ముఠా మరో కొత్త వ్యూహం..!

ఇక జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిపై గురి పెట్టారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ భారతీ వ్యాపార వ్యవహారాలను చూసే బాలాజీ గోవిందప్పలకు విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక అక్కడి నుంచి పరిణామాలు వేగంగా మారాయి. వాళ్ళు హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటీషన్ వేయడం, ఆ తర్వాత వాళ్ళు సుప్రీం కోర్ట్ కు వెళ్ళడం వంటివి జరిగాయి. ఇక సుప్రీం కోర్ట్ కూడా వారిని అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Also Read : మరో ఐఏఎస్ అరెస్టు ఖాయం..!

ఇక నేడు హైకోర్ట్ లో విచారణ జరగగా.. ఈ విచారణలో, కృష్ణ మోహన్ రెడ్డి వాదనలు హైలెట్ అయ్యాయి. తనకు ఏ సంబంధం లేదని ఆయన కోర్ట్ లో వాదించారు. ప్రభుత్వ పెద్దల నిర్ణయమే అని స్పష్టం చేసారు. ఇక కాసేపటి క్రితం తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి.. వారి బెయిల్ పిటీషన్ ను డిస్మిస్ చేసారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. అటు సుప్రీం కోర్ట్ ఆదేశాలు కూడా ఉండటంతో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ కుంభకోణంలో జగన్ చుట్టూ ఉన్న అధికారులని అరెస్ట్ చేస్తే.. ఈ కేసు జగన్ గుమ్మం వరకు వెళ్ళింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్