తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో ఇప్పుడు విచారణ వేగవంతం చేసారు. ఈ ఘటనలో బాధ్యులు ఎవరు అనే దానిపై న్యాయ విచారణ జరుగుతోంది. తిరుపతి కలెక్టరేట్ లో న్యాయవిచారణ కమిషన్ విచారిస్తోంది. తొక్కిసలాట ఘటన పై మూడో దశ విచారణ మొదలైంది. వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది మృతి చెందగా.. 44 మంది భక్తులు గాయపడ్డారు. విచారణ కమిషన్ హెడ్ గా రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ సత్యనారాయణమూర్తిని నియమించారు.
Also Read : బాబు ప్రయోగం సక్సెస్ అవుతుందా..?
ఇప్పటికే రెండు దశల్లో విచారణ పూర్తి చేయగా బాధితులు, సాక్షులను నేరుగా వర్చువల్ గా విచారించింది కమీషన్. ఈ నెల 14 నుంచి మూడు రోజులపాటు తిరుమలలో పర్యటించిన కమిషన్… భక్తుల క్యూలైన్లు, టిటిడి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేయనున్నారు సత్యనారాయణమూర్తి. నేటి నుంచి మూడు రోజుల టీటీడీ ఈవో, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ లను కమిషన్ విచారిస్తుంది. ఈ రోజు కమిషన్ ముందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు.
Also Read : వైసీపీ యాక్టివ్ మోడ్.. రంగంలోకి సజ్జల..!
19 న తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బరాయుడు, మాజీ టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణ కుమార్, 13 మంది టీటీడీ జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు సిఐలు, 6 మంది ఎస్ఐలు హాజరు కానున్నారు. ఈ నెల 20 న, సీవీఎస్ఓ, మాజీ సీవీఎస్ఓలను విచారించనున్నారు. 21 నుంచి 23 వరకు మూడు రోజులు 42 మంది విజిలెన్స్ సెక్యూరిటీ స్టాప్, 32 మంది పోలీసు సిబ్బందిని విచారించనున్నారు. దీనితో ఈ విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.




