అల్లు అరవింద్ నిర్మాతగా నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన తండేల్ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపుతుంది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు సాధిస్తుంది. సినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు కాగా సోమవారం కూడా వసూళ్లు భారీగా వచ్చాయి. వాస్తవానికి సోమవారం సినిమా కలెక్షన్లు చాలా తక్కువగా ఉంటాయి. వీకెండ్ ఏ రేంజ్ లో ఉన్నాయో సోమవారం కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా 73 కోట్లు కలెక్ట్ చేసింది.
Also Read : తమిళనాడులో విజయ్.. జగన్ ఫార్ములా…?
అలాగే సోమవారం ఈ సినిమాకు బుక్ మై షో లో ఏకంగా 73,000 టికెట్లు బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నాలుగు రోజుల్లో 73 కోట్లు రావడంతో.. కచ్చితంగా మరో రెండు మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ఈ సినిమాకు వసూళ్లు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా అమెరికాలో ఇప్పటివరకు 7,50,000 డాలర్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది.
Also Read : బిజెపి ఆదేశాలు.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్
అటు యూకే, ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనితో కచ్చితంగా 120 నుంచి 150 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసే అవకాశం ఉందని.. టాలీవుడ్ పండితులు అంటున్నారు. అదే జరిగితే మాత్రం నాగచైతన్య కెరీర్ లోనే కాదు అక్కినేని ఫ్యామిలీ చరిత్రలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన హీరోగా నాగచైతన్య రికార్డులు క్రియేట్ చేస్తాడు. ఇక ఈ సినిమాకు స్టోరీ ఎంత ప్లస్ అయిందో సాయిపల్లవి కూడా అదే రేంజ్ లో ప్లస్ అవడం వసూళ్లు పెంచుతుంది.




