Friday, September 12, 2025 07:23 PM
Friday, September 12, 2025 07:23 PM
roots

జగన్ అనుకూల అధికారి పై చర్యలకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో కొందరు అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె వెంకట్రామి రెడ్డి అయితే జగన్ కు అనుచరుడుగా మారిపోయారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనపై చర్యలకు రంగం సిద్దమైనట్టుగా కనపడుతోంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి కి ప్రచారం చేసి సస్పెండ్ అయిన సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్య క్షుడు కె.వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది.

15 రోజుల్లో దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. సీసీఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి సంజాయిషీ ఇచ్చాక క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. 2024 మార్చి 31న కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరులో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకుడు చంద్రయ్యతో కలిసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసారు. ఎన్నికల కోడ్ నీ ఉల్లంఘించరాని టీడీపీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

చంద్రయ్య, మరో 11 మందిని ఏప్రిల్ 4న సస్పెండ్ చేశారు అధికారులు. వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్ను అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి నిలిపివేయడం వివాదాస్పదం అయింది. మీడియాలో రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సస్సెండ్ చేస్తూ జీవో జారీ చేశారు. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ అధికారి, సస్పెండ్ అయ్యేనాటికి ఇన్చార్జి అసిస్టెంట్ పోస్టులో ఉన్నారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్వ్యవహరిస్తే రోస్టర్ నిబంధనల ప్రకారం ఆసోసియేషన్లో వెంకట్రామిరెడ్డి సభ్యత్వం కూడా రద్దు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య నారాయణ విషయంలో గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించినట్టు ఉద్యోగులు చెప్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్