తెలుగు సినిమా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన మంచు కుటుంబం గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతోంది. కలెక్షన్ కింగ్ గా పేరున్న మోహన్ బాబు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఈ మధ్య కాలంలో హిట్ కొట్టలేకపోవడం.. ఆయన కుమారులు, విష్ణు, మనోజ్ ఇద్దరూ కూడా సినిమా పరిశ్రమలో ఫెయిల్ కావడం ఆ కుటుంబ అభిమానులను ఆందోళనకు గురి చేసిన అంశం. ఈ మధ్య కాలంలో కూడా పలు సినిమాలు చేసినా అవి సక్సెస్ కాకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
Also Read : బూమ్రా లేకపోతే ఇండియాకు సీన్ లేదా..?
మంచు విష్ణు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురయ్యాడు. ఇలాంటి సమయంలో భారీ అంచనాలతో వచ్చిన కన్నప్ప సినిమా మాత్రం మంచు కుటుంబానికి ప్రాణం పోసింది అనే చెప్పాలి. ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్ నటులను ఈ సినిమా కోసం ఒప్పించింది మంచు కుటుంబం. ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో చేయడంతో ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూడటానికి రావడం కలిసి వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ ను సినిమాలో చూపించారు.
Also Read : సీతక్కకు షాక్ ఇచ్చిన మావోయిస్ట్ లు..!
దీనితో సినిమా చూడటానికి వచ్చిన వారి సినిమా అయ్యే వరకు ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. సినిమాను ముందు తిట్టిన వారు కూడా సైలెంట్ అయ్యారు. వసూళ్లు కూడా భారీగానే వచ్చే అవకాశం కనపడుతోంది. ఈ సినిమాతో తాను ఏంటీ అనేది మంచు విష్ణు ప్రూవ్ చేసుకున్నాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక ప్రభాస్ కు రెమ్యునరేషన్ ఇవ్వకుండా తీసుకున్న సినిమా యూనిట్.. లాభాల్లో వాటా ఇవ్వాలని కోరుతున్నారు. సినిమా ఖచ్చితంగా రెండు వారాలు ప్రభావం చూపడం ఖాయం అంటున్నారు సినిమా అనలిస్ట్ లు.