Monday, October 27, 2025 07:47 PM
Monday, October 27, 2025 07:47 PM
roots

అఖండ సీక్వెల్ పై క్రేజీ అప్డేట్

టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేసేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలను మించి మన తెలుగు సినిమాలు ఆడటం సంచలనం అవుతోంది. బాహుబలి సినిమా నుంచి ఈ ట్రెండ్ మొదలైనా ఇప్పుడు మాత్రం దూకుడు ఎక్కువగా కనపడుతోంది. సీనియర్ హీరోలు కూడా బాలీవుడ్ లో సందడి చేస్తున్నారు. అఖండ సినిమాతో నార్త్ లో బాలయ్య హవా పక్కాగా కనపడింది. అక్కడ ఈ సినిమాను హిందువులు ఎక్కువగా చూసారు. ఇప్పుడు అఖండ సీక్వెల్ ను ప్లాన్ చేసేసారు. ఈ సీక్వెల్ దసరా రోజు అధికారికంగా ప్రకటించి షూట్ మొదలుపెట్టారు.

ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్… బాబీ డియోల్ ను ఫైనల్ చేసినట్టు ప్రచారం జరిగింది. యానిమల్ సినిమాతో బాబీ తెలుగులో కూడా ఫేమస్ అయ్యాడు. అలాగే మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని తీసుకుంటున్నారని ఆమెకు నాలుగు కోట్లు కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలిసింది. ఇక ఇప్పుడు బాలయ్య ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఈజీగా ఉండేందుకు అన్ని భాషల్లో తానే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read : కాస్టింగ్ కౌచ్ పై మహిళా జర్నలిస్ట్ గూబ గుయ్యమనిపించిన అనన్య

మిగిలిన భాషలు కూడా ఆయన చెప్తే సినిమాకు కచ్చితంగా హైప్ వస్తుంది. ఆ భాషలు అన్నీ బాలయ్య ఈజీగానే మాట్లాడతారు. అయితే మూడు భాషల్లో సినిమాను ఏక కాలంలో షూట్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఏది ఎలా ఉన్నా 7 పదుల వయసు దగ్గర పడుతున్నా బాలయ్య మాత్రం దూకుడుగా ఉండటం, వరుసగా సినిమాలు చేయడం మాత్రం సంచలనమే. కాగా ఇటీవల దేవర సినిమా విషయంలో కూడా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్