ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు చంద్రబాబు నాయుడు. అమరావతిని మూడు ముక్కలాటలతో సర్వ నాశనం చేసారని పోలవరం ప్రాజెక్టు నూ గోదావరిలో కలిపేశారన్నారు. రాష్ట్రంలోకి రావాలంటే భయపడే పరిస్థితులు తెచ్చారని ఆయన మండిపడ్డారు. పరిశ్రమలు పెట్టాలంటేనే పారిశ్రామిక వేత్త హడలిపోతున్నారని రాష్ట్రం లో అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుందన్నారు.
Also Read : రైతు భరోసా మోసాలకు చెక్.. రేవంత్ కీలక అడుగులు…!
ఆదాయం పెరిగితే ప్రజల జీవితాలు బాగుపడతాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సిఎం గా అనేక ఆర్థిక సంస్కరణలు ఎంతో కీలకమైనవి..దీన్నే నేను నమ్ముతానన్నారు. పవర్ సెక్టార్ లో ఎన్నో సంస్కరణలు తెచ్చానని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు..రోడ్లకు శ్రీ కారం చుట్టానన్నారు. టెక్నాలజీ..ఐటి తిండి పెడుతుందా అంటూ అప్పట్లో ఎగతాళి చేశారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మనుష్యుల్ని మనుష్యులు గా గుర్తించాలని తెలిపారు.
Also Read : మెంటార్ గా ధోనీ.. ఆ బౌలర్ కావాలి.. రోహిత్ పట్టు..!
ఈ సందర్భంగా కోడి పందాల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు సీఎం. సంప్రదాయాలు కాపాడుతూ పండుగ వాతావరణాన్ని అంతా ఆస్వాదించాలని చిన్నప్పటి నుంచి జల్లికట్టు చూసేవాడిని అని గుర్తు చేసుకున్నారు. జల్లికట్టును చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో తరలి వచ్చేవారని తెలిపారు. అన్ని ఊళ్ళల్లోనూ ఎప్పటి నుంచో కోడి పందాలు ఉన్నాయి, కత్తులు కూడా కట్టేవారని జల్లికట్టు ని నివారించాలంటే చాలా ఇబ్బందులు తలెత్తాయని.. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. మన పండుగను మనం ఘనంగా జరుపుకోవాలని ఈసారి అంతా బాధ్యత తీసుకున్నారని వివరించారు. దాదాపు 10లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ఏపీ కి తరలివచ్చారని పేర్కొన్నారు.