Sunday, March 22, 2026 01:13 PM
Sunday, March 22, 2026 01:13 PM

బాలయ్య విత్ పూరీ… కాంబో రిపీట్…?

ఏడు పదుల వయసు దగ్గర పడుతున్న సరే… నందమూరి బాలకృష్ణ మాత్రం సినిమాలు చేసే విషయంలో ఎక్కడా వెనుకడు వేయడం లేదు. బాలకృష్ణ గతంలో కంటే ఇప్పుడు మరింత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉంటే మరో సినిమా కూడా లైన్ చేస్తున్నారు. దానికి తోడు తన కొడుకు సినిమాలో కూడా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక తన కొడుకుని డైరెక్టు చేయాలనే ప్రయత్నాలు కూడా బాలకృష్ణ చేస్తున్నారు.

ఈ తరుణంలో బాలకృష్ణ మరోసారి పూరీ జగన్నాద్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూరీ జగన్నాథ్ సినిమా చేయడానికి బాలకృష్ణ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పూరి వద్ద కథ సిద్ధంగా లేకపోవడంతో బాలయ్య సినిమా ఆలస్యం అవుతూ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించడానికి పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే గతంలో కంటే భిన్నంగా ఈ కథను పూరి రెడీ చేసుకుని పెట్టుకున్నారట.

Also Read : అశ్విన్‌ సడన్‌ రిటైర్‌మెంట్‌ కారణాలివేనా..?

కచ్చితంగా బాలకృష్ణతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని పూరి పట్టుదలగా ఉండటంతో బాలకృష్ణ కూడా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది పైసా వసూల్ సీక్వెల్ అని కొంతమంది అంటుంటే కాదు కొత్త కథ అని మరికొందరు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా వచ్చేయడాది మాత్రం కచ్చితంగా ఈ సినిమాను లాంచ్ చేయాలని పూరీ జగన్నాథ్, బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ దీనికి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పూరి జగన్నాథ్ మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో భేటీ కూడా అయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్