Friday, September 12, 2025 05:23 PM
Friday, September 12, 2025 05:23 PM
roots

ఏపీ మంత్రుల ‘గ్రౌండ్’ వర్క్ స్టార్ట్..?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది కావస్తోంది. ఈ ఏడాది కాలంలో ముఖ్యమంత్రి లేదంటే కొంతమంది మంత్రుల పనితీరు పక్కన పెడితే.. మెజారిటీ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు తక్కువ. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కొంతమంది మంత్రుల వ్యవహారం కూడా అలాగే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు పెద్దగా ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే వారు కాదు. క్షేత్రస్థాయిలో పర్యటనలకు కూడా మంత్రులు దూరంగానే ఉండేవారు.

Also Read : టీ కాంగ్రెస్ లో ఎంపీ గారి డామినేషన్ వేరే లెవల్

ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన సందర్భాల్లో కూడా పెద్దగా వారు మాట్లాడిన సంఘటనలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇన్చార్జిగా ఉన్న జిల్లాలతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు పలు పర్యటనలకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పెద్ద ఎత్తున మంత్రుల పర్యటనలు మొదలుకానున్నాయి. తమ తమ శాఖలపై పట్టుపెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు మంత్రులకు అవకాశం ఇచ్చారు.

Also Read : విశాఖ మేయర్ ఎన్నిక.. జగన్‌కు బూమ్‌రాంగ్..!

ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. కేవలం నియోజకవర్గాలు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా మంత్రులు ఇమేజ్ పెంచుకోవాలని సూచించారట సీఎం. దీనితో అన్ని శాఖల మంత్రులు తమ శాఖలకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయనున్నారు. అలాగే నేరుగా ప్రజలను, క్షేత్రస్థాయి నాయకులను కలిసి వారికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి పనులు, అలాగే వారి వారి శాఖల్లో జరుగుతున్నటువంటి మార్పులు, అమలు చేస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ పథకాలు, అలాగే విపక్షాలు చేస్తున్న విమర్శలకు వివరణలు, వీటన్నింటినీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముగ్గురు నలుగురు మంత్రులు తమ పర్యటనలకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్