దేశంలో సైలెంట్ గా నోట్ల రద్దు జరుగుతోందా..? అంటే అవునని సంకేతాలు వస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అవినీతికి ఆస్కారం లేకుండా.. నల్లధనం దాచే అవకాశం కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. 2016 నవంబర్ 8న జరిగిన నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను ఒక ఊపు ఊపింది.
Also Read : లోకేష్ ట్వీట్తో టీడీపీ కార్యకర్తలు హర్ట్ అయ్యారా..?
ఆ తర్వాత 2000 నోటు తో పాటుగా కొత్త ₹500 నోటును అలాగే 200 రూపాయల నోటును ప్రవేశపెట్టారు. పాత నోట్లలో కేవలం 100 రూపాయలు నోటు మాత్రమే ప్రస్తుతం చలామణిలో ఉంది. అయితే గత రెండేళ్ల నుంచి 2000 నోటు వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేస్తూ వస్తుంది. రిజర్వ్ బ్యాంకుకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వెళ్లిన ఆదేశాల మేరకు.. 2000 నోటును ఏటీఎంలో అందుబాటులో లేకుండా చేశారు. ఇక అక్కడ నుంచి 2000 నోటు రద్దు జరుగుతోందంటూ ప్రచారం జరిగింది.
Also Read : రాహుల్ సెలెబ్రేషన్ గూస్ బంప్స్.. మామ సునీల్ శెట్టి ఇంట్రస్టింగ్ కామెంట్స్
దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుమార్లు క్లారిటీ ఇచ్చిన అనుమానాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. అయితే ఇప్పుడు 500 నోటును కూడా ఏటీఎంలో నుంచి తొలగించే దిశగా రిజర్వ్ బ్యాంక్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనిపై బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు పంపిణీ కట్టడి చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. 500 రూపాయల నోటును చలామణిలో లేకుండా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 500 రూపాయల నోటు కూడా కనుమరుగయ్య సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే జాతీయ బ్యాంకులతో రిజర్వ్ బ్యాంక్ సంప్రదింపులు జరిపింది. బ్యాంకుల నుంచి క్యాష్ విత్ డ్రా చేసే సమయంలో 500 రూపాయల నోటు చెల్లించవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.