Sunday, March 22, 2026 07:23 AM
Sunday, March 22, 2026 07:23 AM

ఆగ్రో ఉగ్రవాదం.. అమెరికాను షేక్ చేసిన చైనా.. కంగారులో భారత్

కాలం మారుతున్న కొద్దీ సాంకేతిక పరిజ్ఞానం కొత్త రూపు సంతరించుకున్నట్టు.. ఉగ్రవాదం కూడా రోజు రోజుకి తన రూపాన్ని మార్చుకుంటుంది. తుపాకులు, బాంబులు, రాకెట్ లాంచర్ల నుంచి బయో వార్.. ఇప్పుడు ఆగ్రో వార్ దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి చైనా శ్రీకారం చుడుతోంది. తాజాగా అమెరికా విషయంలో చైనా.. ఆగ్రో ఉగ్రవాదానికి శ్రీకారం చుట్టింది. తాజాగా చైనాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

Also Read : తెనాలి పర్యటన వెనుక ఇంత కుట్ర ఉందా..?

అమెరికాలో వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసేందుకు చైనా చేసిన కుట్రగా భావిస్తున్నారు. అక్కడి పంటలలో తల ముడతను కలిగించే వైరస్ ను పంపించేందుకు చైనా కుట్ర చేసినట్టుగా భావిస్తున్నారు. చైనా పౌరుడు జున్యోంగ్ లియు.. అమెరికాలో ఉంటున్న తన ప్రియురాలును కలిసేందుకు గత ఏడాది జులైలో వెళ్ళాడు. ఆ సమయంలో అతని వద్ద కొన్ని అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ఫంగస్‌ ను అక్రమ రవాణా చేసినట్లు ఒప్పుకున్నాడు.

Also Read : మతం కార్డు.. మలేషియాలో పాక్ డ్రామాలు

తన స్నేహితురాలు పనిచేసే మిచిగాన్ విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో దానిపై పరిశోధన చేయడానికి తాను అలా చేశానని అతను చెప్పడం గమనార్హం. దీనిపై అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేసారు. అమెరికాలో ఆహార కొరత సృష్టించేందుకు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ తరహా వైరస్ లను క్రీస్తుపూర్వం 660లో మొదటిసారి ఉపయోగించారని గుర్తించారు. దీనిపై భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ తో చైనాకు ఉన్న స్నేహం నేపధ్యంలో పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి కీలకమైన వ్యవసాయ రాష్ట్రాలు పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఉండటంతో ఈ తరహా దాడులకు దిగే అవకాశం ఉందనే ఆందోళన మొదలైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్