రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటినుంచి అంచనాలు వేరే లెవల్ కు వెళ్తున్నా సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. అందుకే సందీప్ రెడ్డి ఈ సినిమా విషయంలో క్రేజీ అప్డేట్స్ ఇస్తూ ఆ హైప్ ను ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విషయంలో సందీప్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. హడావుడిగా స్టార్ట్ చేయకుండా కాస్త లేట్ అయిన పర్వాలేదు ఇండియన్ సినిమాలో మరో సెన్సేషన్ క్రియేట్ చేయాలని రంగంలోకి దిగుతున్నాడు.
Also read : జగన్.. ఈ సారి కూడా మడమ తిప్పుతున్నాడా..?
ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ‘ది రాజా సాబ్’ అనే సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో సినిమా రానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ షూటింగ్లో పాల్గొంటాడు. ఇప్పటికే మ్యూజిక్ వర్క్ కూడా సందీప్ రెడ్డి స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి ఉండే ఛాన్స్ ఉందని చాలామంది ఎదురు చూశారు. కానీ అనుకున్న దానికంటే నాలుగు నెలలకు ముందుగానే సినిమా షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.
Also read : టీడీపీ పొలిట్బ్యూరో మీటింగ్.. ఇవే కీలకం..!
దాదాపుగా మే నెలలో ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగ వర్కౌట్ మొదలుపెట్టేసాడు. మే రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరగనుంది. ఆ తర్వాత బెంగళూరులో కొంత షూటింగ్ చేసి విదేశాల్లో షూటింగ్ కంటిన్యూ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ గా మెగా హీరో వరుణ్ తేజ్ ను తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ముందు సౌత్ కొరియా విలన్ డాంగ్ లీ పేరును పరిశీలించారు మేకర్స్.